57ఏళ్లు నిండిన వాళ్లకి త్వరలో పింఛన్లు

57ఏళ్లు నిండిన వాళ్లకి త్వరలో పింఛన్లు
  • ఆర్థిక మంత్రి హరీశ్ రావు

అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు 57 ఏళ్లు నిండిన వారందరికీ త్వరలోనే పింఛన్లు అందిస్తామని రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్ రావు చెప్పారు. సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండల కేంద్రంలో కొత్తగా నిర్మించిన 30 పడకల ఆసుపత్రిని ఆయన సోమవారం ప్రారంభించారు.

అనంతరం మాట్లాడుతూ ఆస్పత్రిలో వైద్య పరీక్షలకు అవసరమైన యంత్రాలు, పరికరాల కోసం రూ 50 కోట్ల నిధులు మంజూరు చేశామని హరీశ్ రావు చెప్పారు. గోదావరి జలాలతో సింగూరు ప్రాజెక్టును నింపి మెదక్ జిల్లా తాగునీటి కొరతను తీరుస్తామని హామీ ఇచ్చారు.

రూ.2500 కోట్లతో సంగారెడ్డి నాందేడ్ అకోలా జాతీయ రహదారిని నాలుగు లేన్ల రహదారిగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. త్వరలో 57 నుంచి 60 ఏళ్ల లోపు వయస్సున్న వారికి సైతం పింఛను అందించేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు.