జల్సాలకు అలవాటు పడి దొంగగా మారిన యువకుడు..

జల్సాలకు అలవాటు పడి దొంగగా మారిన యువకుడు..

జల్సాలకు అలవాటుపడి దొంగతనాలు చేస్తున్న ఓ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ.17లక్షల విలువ చేసే బంగారు, సిల్వర్ ఆభరణాలు, ల్యాప్ టాప్, దొంగతనానికి ఉపయోగించే పనిముట్లు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ పాతబస్తీలోని బండ్లగుడ పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రిపూట తాళం వేసిన ఇండ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న సుల్తాన్ సయ్యద్ అహ్మద్ హిళాల్ అనే దొంగను పోలీసులు పట్టుకున్నారు. 

బండ్లగూడా పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తూ.. చుట్ట ప్రక్కల ప్రాంతాల్లో రాత్రి పూట తిరుగుతు తాళం వేసి ఉన్న ఇండ్లలో చొరబడి దొంగతనాలకు చేసేవాడని పోలీసులు తెలిపారు. అయితే నిందితుడు ఒక్కడే దొంగతనం చేసేవాడని.. మొదటి సరిగా అరెస్ట్ అయినట్లు పోలీసులు తెలిపారు.