పెద్డపల్లి జిల్లా: పెద్దపల్లి జిల్లాలో నిన్న టీఆర్ఎస్ నిర్వహించిన భారీ బహిరంగ సభలో విషాదం నెలకొంది. సీఎం కేసీఆర్ సభా ప్రాంగణంలో ఓ వృద్ధురాలు స్పృహ తప్పి పడిపోయి మృతి చెందింది. ఓదెల మండలం నాంసానిపల్లి గ్రామానికి చెందిన మిట్టపల్లి రాజమ్మ(70).. నిన్న టీఆర్ఎస్ సభకు వెళ్లి... అక్కడ స్పృహ తప్పి పడిపోయింది, వెంటనే ఆమెను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా... అక్కడ పరిస్థితి విషమించి నిన్న రాత్రి మృతి చెందింది.