
హైదరాబాద్సిటీ వెలుగు : ఎల్బీ స్టేడియంలో సోమవారం ఒలింపిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. 14 ప్రాంతాల నుంచి ఒలింపిక్ రన్ ద్వారా విద్యార్థులు ఇక్కడికి చేరుకున్నారు. రాష్ట్ర ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, మంత్రి వాకిటి శ్రీహరి, పారా ఒలింపిక్ పతక విజేత దీప్తి జివాంజీ పాల్గొన్నారు.