తెలుగు స్మాల్ స్క్రీన్ సెలబ్రిటీ, టీవీ యాంకర్ ఓంకార్(Omkar).. ప్రముఖ టెలివిజన్ షోలను నిర్మించి, హోస్ట్ చేయడంలో సక్సెస్ ఫుల్ అయ్యారు. రీసెంట్ గా ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు(Ashwinbabu) హీరోగా హిడింబా అనే మూవీతో వచ్చిన విషయం తెలిసేందే. థియేటర్లో రిలీజై పాజిటివ్ టాక్ తో దూసుకెళ్లగా.. ఇప్పుడు ఓటీటీ లో రిలీజ్ అవ్వడానికి రెడీ గా ఉంది.
లేటెస్ట్ అప్డేట్ మేరకు..ఈ యంగ్ హీరో అశ్విన్ బాబు మరో కొత్త మూవీతో రానున్నారు. ఇవాళ (అగస్ట్ 1న) అశ్విన్ బాబు బర్త్ డే స్పెషల్ గా కొత్త సినిమా టైటిల్ తో పాటు ఫ్రీ లుక్ కూడా రివీల్ చేయడం జరిగింది. వచ్చిన వాడు గౌతమ్ అనే విభిన్నమైన టైటిల్తో పోస్టర్ ను రిలీజ్ చేసి..ఆడియన్స్ లో ఆసక్తి కలిగించారు మేకర్స్. మెడికో థ్రిల్లర్ కథాంశంతో వస్తోన్న ఈ మూవీలోని అశ్విన్ లుక్ ఆడియన్స్ లో ఇంటెన్స్ పెంచుతోంది.
మామిడాల ఎం.ఆర్ రామకృష్ణ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీ కోసం..మెడికల్ ఫీల్డ్ లోని కొత్త యాంగిల్ ను చూపిస్తోన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ త్వరలో హైదరాబాద్, విశాఖలో పరిసర ప్రాంతాల్లో స్టార్ట్ అవ్వనున్నట్లు సమాచారం. ఈ మూవీకు పవర్ ఫుల్ డైలాగ్ రైటర్ అబ్బూరి రవి మాటలు రాస్తుండగా.. రామ్ - లక్ష్మణ్ మాస్టర్స్ ఫైట్ మాస్టర్స్ గా చేస్తున్నారు.
పాలక్ లల్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా.. నాజర్, అచ్యుత్, ఆర్జే హేమంత్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ మూవీను శ్రీ శైలేంద్ర సినిమాస్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ డీఎస్ రావు నిర్మిస్తున్నారు. కాగా హరి గౌర మ్యూజిక్ అందిస్తున్నారు.