- రాజేంద్రనగర్ తహసీల్దార్ ఆఫీసులో అందజేత
గండిపేట్,వెలుగు : చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి సోమవారం నామినేషన్ను దాఖలు చేయనున్నారు. సోమవారం ఉదయం 11.15 గంటలకు రాజేంద్రనగర్లోని తహసీల్దార్ ఆఫీసులో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేయనున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పియూష్ గోయల్
ఎంపీ, జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కె.లక్ష్మణ్, స్పోక్స్ పర్సన్ రాణి రుద్రమదేవి హాజరుకానున్నారు. నామినేషన్ సందర్భంగా భారీ ర్యాలీతో పాటు సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.