రేపు నగరంలో మద్యం అమ్మకాలు బంద్

రేపు నగరంలో మద్యం అమ్మకాలు బంద్

శ్రీరామనవమి సందర్భంగా ఈనెల 14వ తేదీ ఆదివారం ఉదయం 6 గంటల నుంచి 15వ తేదీ సోమవారం ఉదయం 6 గంటల వరకు వైన్ షాపులు మూసేయాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. వైన్ షాపులతో పాటు బార్లు, బార్ అండ్ రెస్టారెంట్లను కూడా మూసేయాలని తన ఆదేశాల్లో పేర్కొంది. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోఈ ఆదేశాలు అమలు చేయాలని తెలిపింది.

రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఈనెల 9వ తేదీ సాయంత్రం నుంచి 11వ తేదీ సాయంత్రం వరకు మద్యం అమ్మకాలపై ఎన్నికల కమిషన్ నిషేధం విధించింది. ఎన్నికల ముగిసిన తర్వాత.. 12, 13 తేదీల్లో మళ్లీ మద్యం షాపులు తెరుచుకున్నాయి. ఇప్పుడు శ్రీరామనవమి సందర్భంగా మరోసారి వైన్ షాపులను మూసేయాలని ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది.