జర్నలిస్టు హత్య కేసులో అనుమానితుడి అరెస్టు

జర్నలిస్టు హత్య కేసులో అనుమానితుడి అరెస్టు

ప్రముఖ జర్నలిస్టు గౌరీ లంకేష్‌ హత్యకేసులో నిందితుడిగా అనుమానిస్తున్న ఒకరిని బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు.  జార్ఖండ్‌ రాష్ట్రంలోని ధన్‌బాద్‌ జిల్లాలో గురువారం అర్ధరాత్రి అరెస్టు చేశారు. గౌరీ లంకేశ్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న రుషికేష్‌ దేవ్రీకర్‌ అలియాస్‌ రాజేష్‌ అలియాస్‌ శివ కొంత కాలంగా పేరు మార్చుకుని ఒక ప్రముఖ వ్యాపారికి చెందిన భవంతికి కేర్‌టేకర్‌గా పనిచేస్తున్నాడన్నసమాచారంతో పో్లీసులు అరెస్టు చేశారు. అతడిని అక్కడి చీఫ్‌ జుడిషియల్‌ మెజిస్టేట్‌ కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్‌ రిమాండు పొందారు.  గత ఐదు రోజులుగా అతడి కదలికలను కనిపెట్టిన బెంగళూరు పోలీసులు కత్రాస్‌లోని రాజ్‌గధియా మార్కెట్‌ సమీపంలో అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. దేవ్రీకర్‌ వేర్వేరు మొబైల్స్ ను వాడుతున్నాడని, అతడి మొబైల్‌ లొకేషన్‌ ఆధారంగా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.

2017 సెప్టెంబర్‌ 5న గౌరీ లంకేష్‌ బెంగళూరులోని తన నివాసంలో హత్యకు గురయ్యారు.