మృతుల కుటుంబాలకు రూ.కోటి ఎక్స్ గ్రేషియా

మృతుల కుటుంబాలకు రూ.కోటి ఎక్స్ గ్రేషియా

విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ లో గ్యాస్ లీకేజీ ఘటనలో మృతుల కుటుంబాలకు రూ. కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు సీఎం జగన్మోహన్ రెడ్డి. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని చెప్పారు. కేజీహెచ్ ఆస్పత్రిలో బాధితులను పరామర్శించిన తర్వాత… ఆయన మీడియాతో మాట్లాడారు.

గ్యాస్ లీకేజీ సంఘటన  చాలా బాధాకరమన్నారు సీఎం జగన్. స్వల్పంగా అస్వస్థతకు గురైన వారికి 25 వేలు, తీవ్రంగా అస్వస్థతకు గురైన వారికి పది లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించనున్నట్లు తెలిపారు. బాధితుల చికిత్సకు అయ్యే మొత్తం ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందన్నారు. గ్యాస్ ఎఫెక్టెడ్ గ్రామాల్లోని ప్రజలందరికీ పది వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించనున్నట్లు చెప్పారు. గ్యాస్ లీకేజీ గ్రామాలలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు సీఎం జగన్.