కశ్మీర్లోని పుల్వామా జిల్లాలో టెర్రరిస్టులకు, సైనికులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఒక సైనికుడు మరణించినట్లు ఇండియన్ ఆర్మీ తెలిపింది. శనివారం రాత్రి ఒంటి గంట సమయంలో మొదలైన ఈ కాల్పుల్లో లష్కరే తోయిబాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు మరియు భారత ఆర్మీకి చెందిన ఒక సైనికులు మృతిచెందారు. దక్షిణ కాశ్మీర్ జిల్లాలోని జాదూరా ప్రాంతంలో నిన్న అర్థరాత్రి భద్రతా దళాలు ఉగ్రవాదుల కోసం సెర్చింగ్ చేస్తుండగా ఈ ఎన్కౌంటర్ జరిగింది.
కేంద్రపాలిత ప్రాంతంలో 24 గంటల్లో ఇది రెండవ ఎన్కౌంటర్. శుక్రవారం కూడా ఒక ఎన్కౌంటర్ జరిగింది. ఆ ఎన్కౌంటర్లో నలుగురు ఉగ్రవాదులు మృతి చెందగా, ఒకరు షోపియన్ జిల్లాలోని కిలోరా ప్రాంతంలో పట్టుబడ్డారు. చనిపోయిన నలుగురు ఉగ్రవాదులలో ఇద్దరు ఉగ్రవాదులు గతంలో బీజేపీ గ్రామ పంచాయతీ సర్పంచ్ ని కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
For More News..