నీట్ పీజీ కటాఫ్ స్కోర్​తో దరఖాస్తుకు మరో చాన్స్​

నీట్ పీజీ కటాఫ్ స్కోర్​తో  దరఖాస్తుకు మరో చాన్స్​

వరంగల్​ సిటీ, వెలుగు: నీట్ పీజీ  కటాఫ్‌‌ స్కోర్‌‌ తగ్గిన నేపథ్యంలో  కన్వీనర్, యాజమాన్య కోటాలో దరఖాస్తుకు  కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం గురువారం ప్రకటన‌‌ను విడుదల చేసింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నీట్ కటాఫ్ స్కోర్​ను  అన్ని కేటగిరీలకు ‘0’ పర్సెంటైల్‌‌ తగ్గించిన విషయం తెలిసిందే. ఈ మేరకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకునేందుకు యూనివర్సిటీ ప్రకటన  జారీ చేసింది. అభ్యర్థులు ఈ  నెల 24 సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌‌లైన్‌‌లో దరఖాస్తుతో పాటు సంబంధిత ధ్రువీకరణ పత్రాలను అప్‌‌లోడ్‌‌ చేయాలని సూచించారు.  ధ్రువపత్రాల  పరిశీలన తర్వాత తుది మెరిట్‌‌ జాబితాను విడుదల చేస్తారు. వివరాలకు www.knruhs.telangana.gov.inను చూడాలని వర్సిటీ అధికారులు  తెలిపారు.