V6 News

రోడ్డు నిబంధనలు పాటించాలని ‘హామీ పత్రాలు’  తీసుకొస్తాం

రోడ్డు నిబంధనలు పాటించాలని ‘హామీ పత్రాలు’  తీసుకొస్తాం
  • కలెక్టర్లు, ఆఫీసర్లు ప్రతినెలా బ్లాక్​ స్పాట్లను విజిట్​ చేయాలి
  • సైన్​ బోర్డులను ఏర్పాటు చేయాలి
  • రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్​

మహబూబ్​నగర్​ అర్బన్, వెలుగు : వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి రోడ్డు నిబంధనలు పాటిస్తామని, యువత, విద్యార్థుల నుంచి హామీ పత్రాలు తీసుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నామని రవాణా శాఖ మంత్రి పొన్న ప్రభాకర్​ అన్నారు. మహబూబ్​నగర్​నగరంలోని పంచవటి విద్యాలయంలో శనివారం నిర్వహించిన ‘అరైవ్​ అలైవ్​’ కార్యక్రమానికి మంత్రి పొన్న ప్రభాకర్​తో పాటు పశు సంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అంతకుముందు వారు ఎంవీఎస్​ డిగ్రీ కాలేజ్​ నుంచి పంచవటి విద్యాలయం వరకు హెల్మెట్​ ధరించి, బైక్​పై ర్యాలీ నిర్వహించారు. 

విద్యార్థులు ఏర్పాటు చేసిన మానవహారాన్ని పరిశీలించారు. రోడ్​ సేఫ్టీ అవేర్సెన్​లో భాగంగా ఏర్పాటు చేసిన హెల్త్​ క్యాంప్​, కంటి వైద్య శిబిరాలను మంత్రులు ప్రారంభించారు. విద్యాలయంలో పిల్లల ట్రాఫిక్​ అవేర్​నెన్స్​ పార్కును ఓపెన్​ చేశారు.  ఈ సందర్భంగా మంత్రి పొన్న ప్రభాకర్​ మాట్లాడుతూ తెలంగాణను రోడ్డు ప్రమాద రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రజల భాగస్వామ్యంతో పెద్ద ఎత్తున అరైవ్​ అలైవ్​ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. 

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని గోల్డెన్​ అవర్​లో హాస్పిటల్​లో చేర్చి, వారి ప్రాణాలను కాపాడిన వారిని గుర్తించి ‘రహవీన్’' అవార్డు పథకం కింద ప్రభుత్వం పారితోషికం అందిస్తుందని చెప్పారు. విద్యార్థులకు ట్రాఫిక్​ రూల్స్​పై అవగాహన కల్పించడానికి యూనిసెఫ్​ సహకారంతో స్కూల్స్​లో చిల్డ్రన్​ ట్రాఫిక్​ అవేర్​నెన్స్​ పార్కులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమైన తర్వాత ‘మేము రోడ్డు నింబంధనలు పాటిస్తాం’ అనే హామీ పత్రాన్ని తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ప్రతినెలా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఆఫీసర్లు, ప్రజాప్రతినిధులు బ్లాక్​ స్పాట్స్​ను గురించి, అక్కడ సైన్​ బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. పశు సంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ అతి వేగం, నిర్లక్ష్యంతోనే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. 

పిల్లలకు వాహనాల కొనిచ్చేటప్పుడు పెద్దలు కచ్చితంగా వారికి సూచనలు చేయాలన్నారు.  కార్యక్రమంలో ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్​ రెడ్డి, రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్​ ఇలంబర్తి, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, మహబూబ్​నగర్​ కలెక్టర్​ ఖుష్బూ గుప్తా, ఎస్పీ డి.జానకి, రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ చైర్​ పర్సన్​ సీతా దయాకర్​ రెడ్డి, మైనార్టీ ఫైనాన్స్​ కార్పొరేషన్​ చైర్మన్​ ఒబేదుల్లా కొత్వాల్​, నగర మేయర్​ మమత, అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ, ముడా చైర్మన్​ లక్ష్మణ్​ యాదవ్​, గ్రంథాలయ సంస్థ చైర్మన్​ నర్సింహారెడ్డి, డిప్యూటీ మేయర్​ మారేపల్లి సురేందర్​ రెడ్డి పాల్గొన్నారు.