ఢిల్లీలో మరో కరోనా పాజిటివ్..31కి చేరిన కేసులు

ఢిల్లీలో మరో కరోనా పాజిటివ్..31కి చేరిన కేసులు

భారత్ లో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదు అయ్యింది. థాయ్ లాండ్ నుంచి వచ్చిన ఢిల్లీ వాసికి పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. దీంతో భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు 31కి చేరాయి.  ఢిల్లీలోని ఉత్తమ్ నగర్లో అతను నివాసముంటున్నాడు. దేశంలోని అన్ని ఎయిర్ పోర్టులను, ఓడ రేవులు ఇతర ప్రాంతాల్లో అధికారులు స్క్రీనింగ్‌ టెస్టులు నిర్వహిస్తున్నారు.

మరో వైపు కేరళ ఆరోగ్య శాఖ మంత్రితో తెలంగాణ అధికారుల బృందం సమావేశమైంది. ఇటీవలే కేరళలో ముగ్గురికి కరోనా పాజిటివ్ వచ్చింది. వారిని ఐసోలేషన్ వార్డులో ఉంచి పూర్తిగా నయం చేశారు అక్కడి డాక్టర్లు. దీంతో తెలంగాణ అధికారులు అక్కడ ఫాలో అయిన విధానాల గురించి తెలుసుకునేందుకు కేరళ వెళ్లారు. కరోనా పేషెంట్లను ఎలా ట్రీట్ చేశారో తెలుసుకున్నారు. హైదరాబాద్ లో ప్రైవేట్ హాస్పిటల్స్ లోనూ ఐసోలేషన్ వార్డులకు అనుమతించామని, కేవలం ఒక్క పాజిటివ్ కేసు మాత్రమే నమోదైందని డాక్టర్ మహబూబ్ ఖాన్ అన్నారు.