
ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. అనారోగ్యంతో గాంధీ ఆసుపత్రిలో చేరిన ఆయన.. అక్కడే చికిత్స పొందతూ ఆదివారం మధ్యాహ్నం సమయంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
రాకేష్ మాస్టర్ అంటే కొందరికి పడదని సినీ పరిశ్రమలో ఉన్న అందరికీ తెలుసు. ఉన్నది ఉన్నట్టు చెప్పడం రాకేష్ మాస్టర్ ప్రత్యేకత. అది కొందరికీ నచ్చేది కాదు. కొందరి వల్ల తన కెరీర్ నాశనమైనట్లు రాకేష్ మాస్టర్ కొన్ని ఇంటర్వ్యూల్లో చెప్పడం కూడా ఎన్నో సార్లు చూశాం. ఏదేమైనా ఇన్నాళ్లు అందరి మధ్య ఉన్న మాస్టర్ ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడం బాధాకర విషయం.
రాకేష్ మాస్టర్ మాటల్లోని గోల్డెన్ డైలాగ్
ఒక ఇంటర్వ్యూలో మాస్టర్ కులం ప్రస్తావన తెస్తూ రాజకీయాల చేసే వారిని ఉద్దేశిస్తూ మాట్లాడిన డైలాగ్ నెట్టింటవైరలవుతోంది. "నీది తక్కువ కులం. మాది ఎక్కువ కులం ఏంట్రా. కొయ్ నాకొడకా నీదాంట్లో బంగారం వస్తుందేమో చూద్దాం.. రక్తమేగా వచ్చేది. సిగ్గు శరం ఉండాలి. కులాల పేరు మీద.. మతాల పేరు మీద మాట్లాడడాలు, రాజకీయాలు చేయడాలు మానుకోవాలి.." అంటూ చెప్పిన డైలాగ్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇంకెందుకు ఆలస్యం.. ఆ డైలాగ్ మీరు వినేయండి.
RIP Master ??#RakeshMaster pic.twitter.com/kA2W5Qvnfi
— Sᴜᴍᴀɴᴛʜ Nᴀɪᴅᴜ ⚡ (@GSumanth73) June 18, 2023