- షాప్ ఓనర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు
బషీర్ బాగ్, వెలుగు : నకిలీ నల్ల మిరియాలు అమ్మే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి.. 4 లక్షలు విలువైన 700 కేజీలు సీజ్ చేశారు. బేగంబజార్ ఫిష్ మార్కెట్ వద్ద వినోద్ ట్రేడింగ్ కంపెనీ పేరిట వినోద్ కుమార్ గెహ్లాట్ హోల్ సెల్ కిరాణా షాప్ నిర్వహిస్తున్నాడు. ఈజీ మనీ కోసం మైసూర్ నుంచి బొప్పాయి విత్తనాలు కలిపిన నకిలీ నల్ల మిరియాలను తక్కువ ధరకు కొనుగోలు చేసి తెచ్చి, మార్కెట్ ధరకు అమ్ముతున్నాడు. సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్, షాహినాయత్ గంజ్ పోలీసులు గురువారం షాప్ పై దాడి చేసి నకిలీ నల్ల మిరియాలను స్వాధీనం చేసుకుని ఓనర్ పై కేసు నమోదు చేశారు.