కొడంగల్, వెలుగు: పంచాయతీ ఎన్నికల సందర్భంగా గ్రామానికి ఓటు వేసేందుకు వచ్చి రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందాడు. హైదరాబాద్లో కేటరింగ్ పని చేసుకునే ఆనంద్(27), భరత్కుమార్, ఆనంద్ ఓటు వేసేందుకు తమ సొంత గ్రామం కొడంగల్ మండలంలోని చిన్ననందిగామాకు వచ్చారు. ఓటు వేసి తిరిగి బైక్పై తిరిగి వెళ్తుండగా బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ప్రమాదంలో ఆనంద్ స్పాట్లోనే మృతిచెందగా, తీవ్రంగా గాయపడ్డ భరత్కుమార్, నర్సింహులును హైదరాబాద్కు తరలించారు.

