డెడ్​బాడీ హాస్పిటల్​లో వదిలేసి పరార్​

డెడ్​బాడీ హాస్పిటల్​లో వదిలేసి పరార్​
  • ఒకరిని గుర్తించిన పోలీసులు

పద్మారావునగర్​, వెలుగు: గాంధీ హాస్పిటల్​లో ఓ వ్యక్తి డెడ్​బాడీని వదిలేసి పరారైన వారిలో ఒకరిని చిలకలగూడ పోలీసులు గుర్తించారు. ఇన్​స్పెక్టర్ నరేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 10న గచ్చిబౌలిలోని బిల్డింగ్ కన్​స్ట్రక్షన్ వద్ద జరిగిన గొడవలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని కొందరు వ్యక్తులు అదే రోజు రాత్రి గాంధీ హాస్పిటల్ ఎమర్జెన్సీ వార్డుకు తీసుకొచ్చారు. డాక్టర్లు పరీక్షించి  ఆ వ్యక్తి చనిపోయినట్లు చెప్పారు.  దీంతో డెడ్ బాడీని వదిలేసి సదరు వ్యక్తులు పారిపోయారు.

దీని గురించి సమాచారం అందుకున్న పోలీసులు గాంధీ హాస్పిటల్​కు చేరుకున్నారు. చనిపోయిన వ్యక్తి చేతిపై జితేందర్ క్రిషి అని హిందీలో రాసిన టాటూను గుర్తించారు. గొడవలో జితేందర్ తీవ్రంగా గాయపడి చనిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే, డెడ్​బాడీని వదిలేసి పరారైన వారిలో ఒకరిని హాస్పిటల్ సీసీ కెమెరా ఫుటేజ్​లో గుర్తించినట్లు ఇన్​స్పెక్టర్ నరేశ్ తెలిపారు. ఆ వీడియో ఫుటేజ్​ను ఆదివారం రాత్రి ఆయన మీడియాకు రిలీజ్ చేశారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.