హైదర్ గూడలో అగ్ని ప్రమాదం..ఒకరు సజీవదహనం

హైదర్ గూడలో అగ్ని ప్రమాదం..ఒకరు సజీవదహనం


హైదరాబాద్ నారాయణగూడ అవంతి నగర్ లో అగ్ని ప్రమాదం జరిగింది. మంటల్లో చిక్కుకొని ఒకరు సజీవ దహనం అయ్యారు. ఐదుగురిని కాపాడి హాస్పిటల్ కు తరలించారు నారాయణగూడ పోలీసులు. కుటుంబ సభ్యులు నిద్రపోతుండగా మంటలు చెలరేగాయి. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతున్ని గౌరీనాథ్ గా గుర్తించారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందా లేక వేరే కారణాలు ఉన్నాయా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.