డిజిటల్ చెల్లింపులకే అనుమతి: టోల్ చెల్లింపులకు క్యాష్ కుదరదు

డిజిటల్ చెల్లింపులకే అనుమతి: టోల్ చెల్లింపులకు క్యాష్ కుదరదు

న్యూఢిల్లీ: జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులను ఏప్రిల్ నుంచి నిలిపివేసేందుకు ఎన్​హెచ్ఏఐ సిద్ధమవుతోంది. ఫాస్ట్‌‌‌‌ ట్యాగ్, యూపీఐ ద్వారానే చెల్లింపులు అనుమతించనున్నారు. ప్రయాణికుల రద్దీ తగ్గించడం, పారదర్శకత పెంచడం దీని ప్రధాన ఉద్దేశం. 

ప్రస్తుతం 98 శాతం వాహనాలు ఫాస్ట్‌‌‌‌ట్యాగ్ వాడుతున్నాయి. నగదు రూపంలో చెల్లిస్తే రెట్టింపు చార్జీ వసూలు చేస్తారు. ఈ నిర్ణయం వల్ల ప్రయాణ సమయం ఆదా అవుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న 1,150 టోల్ ప్లాజాల్లో ఇది అమలు కానుంది.