శాంతియుత పద్ధతిలో అభిప్రాయాలు వ్యక్తం చేయాలి

శాంతియుత పద్ధతిలో అభిప్రాయాలు వ్యక్తం చేయాలి

పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ పలు ప్రాంతాల్లో కొనసాగుతోన్న హింసాత్మక ఘటనలపై స్పందించారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి. శాంతియుతమైన పద్ధతిలో అభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కు ఎవరికైనా ఉందన్నారు. అయితే, కొందరు బస్సులను, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేసే ప్రయత్నం చేశారని అన్నారు. హింసాత్మక ఘటనలకు పాల్పడి ప్రజలను ఇబ్బందులకు గురి చేసే హక్కు ఎవరికీ లేదని, కొన్ని పార్టీలు హింసాత్మక ఘటనలను ప్రోత్సహించేలా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. కొన్ని సంస్థలు ఆందోళనలతో హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నాయని కిషన్ రెడ్డి అన్నారు.

జేఎంఐ, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీల్లో హింసాత్మక ఘటనలు జరిగాయి. ఇవాళ కూడా విద్యార్థులు ఆందోళనల్లో పాల్గొన్నారు.