పీఆర్సీ అనుబంధ జీవోలు.. టీఏ, కన్వీనియన్స్ అలవెన్స్ ఇతరత్రా పెంచుతూ ఉత్తర్వులు

పీఆర్సీ అనుబంధ జీవోలు.. టీఏ, కన్వీనియన్స్ అలవెన్స్ ఇతరత్రా పెంచుతూ ఉత్తర్వులు

హైదరాబాద్, వెలుగు : పీఆర్సీ ఇచ్చిన మూడేండ్ల కు దాని అనుబంధ జీవోలను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం రిలీజ్ చేసింది. ఇంకో వారంలో పీఆర్సీ ముగియనుంది. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు, పింఛనర్లకు ఇచ్చే అలవెన్స్​ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. జీవోలో పేర్కొన్న దాని ప్రకారం, ఉద్యోగులకు ట్రావెలింగ్ అండ్ కన్వీని యన్స్ అలవెన్స్ 30%  పెంచింది. బదిలీపై వెళ్లే ఉద్యోగులకు ట్రాన్స్​పోర్ట్ అలవెన్స్ 30% పెం చింది. సెలవురోజుల్లో పనిచేసే లిఫ్ట్ ఆపరేటర్లు, డైవర్లకు అదనంగా రూ.150 చెల్లించాలని నిర్ణయించింది. షెడ్యూల్ ఏరియాలో పనిచేసే ఉద్యోగులకు స్పెషల్ కాంపన్సెటరీ అలవెన్స్ 30% పెంచింది. దివ్యాంగ ఉద్యోగులకు ఇచ్చే కన్వీయన్స్ అలవెన్స్ రూ.3వేలకు పెంచింది. ఇండ్లు నిర్మించుకునే వారికి ఇచ్చే అడ్వాన్స్ పరిమితిని రూ.30 లక్షలకు పెంచింది. కారు కొనే వారికి ఇచ్చే అడ్వాన్స్ పరిమితిని రూ.9 లక్షలకు పెంచింది.

ఉద్యోగుల పిల్లల పెండ్లికి సంబంధించి, కుమార్తె పెండ్లికి ఇచ్చే అడ్వాన్స్ రూ.లక్ష నుంచి రూ.4 లక్షలు, కుమారుడి పెండ్లికి ఇచ్చే అడ్వాన్స్ రూ.75వేల నుంచి రూ.3 లక్షలకు పెంచింది. స్టేట్ ట్రైనింగ్ ఇన్​స్టిట్యూట్​ ఉద్యోగులకిచ్చే ఇన్సెంటివ్ 30% పెంచింది. గ్రేహౌండ్స్, ఇంటిలిజెన్స్, ట్రాఫిక్, సీఐడి, ఆక్టోపస్, యాంటి నక్సలైట్ స్క్వాడ్ విభాగాల్లో పని చేసే పోలీసులకు ఇచ్చే స్పెషల్ పే ను 2020 పే స్కేల్ ప్రకారం వర్తింపచేస్తారని పేర్కొంది. ప్రొటోకాల్ డిపార్ట్​మెంట్ లో విధులు నిర్వర్తించే అన్ని కేటగిరీల్లోని ఉద్యోగులకు అదనంగా 15శాతం స్పెషల్ పే మంజూరు చేసింది.