ఇబ్రహీంపట్నం, వెలుగు: ఔటర్ రింగ్ రోడ్డు సర్వీస్ రోడ్డులో గుర్తు తెలియని మృతదేహం కనిపించింది. ఆదిబట్ల సీఐ రవికుమార్ తెలిపిన ప్రకారం.. ఆదివారం ఉదయం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం బొంగుళూర్ సమీపంలో ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నంబర్ 12 నుంచి ఆదిబట్ల వెళ్లే సర్వీస్ రోడ్డు పక్కన ఓ వ్యక్తి మృతదేహం కుళ్లిన స్థితిలో కనిపించింది. 30 ఏండ్ల వయస్సు ఉంటుందని, నాలుగు రోజుల క్రితం చనిపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. సంఘటనా స్థలాన్ని మహేశ్వరం అదనపు డీసీపీ సత్యనారాయణ, ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు పరిశీలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.
