ఈనెల 21 నుంచి ఓయూ డిగ్రీ పరీక్షలు

ఈనెల 21 నుంచి ఓయూ డిగ్రీ పరీక్షలు
  • డిగ్రీ అన్ని సెమిస్టర్ల బ్యాక్ లాగ్ తేదీల ప్రకటన
     

హైదరాబాద్: డిగ్రీ  సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 21వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ఉస్మానియా విశ్వవిద్యాలయం పరీక్షల విభాగం కంట్రోలర్ ప్రొఫెసర్ నగేష్ ఒక ప్రకటనలో తెలిపారు. బిఏ, బి.కాం, బీఎస్సీ,బీబీఏ,బి.ఎస్.డబ్ల్యూ తదితర కోర్సుల్లో... 2, 4, 6 సెమిస్టర్లు చదువుతున్న రెగ్యులర్ విద్యార్థులతో పాటు... అన్ని సెమిస్టర్లకు సంబంధించిన బ్యాక్ లాగ్ పరీక్షల తేదీలను ప్రకటించారు. ఉస్మానియా పరిధిలో డిగ్రీ చదువుతున్న 410 డిగ్రీ కళాశాలల విద్యార్థులకు... 350 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని వివరించారు. 
దాదాపుగా 4లక్షల 84వేల 291 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారని... ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. సబ్జెక్టుల వారిగా పరీక్ష తేదీల కోసం యూనివర్సిటీ వెబ్సైట్..  www.osmania.ac.in ని సంప్రదించాలని ప్రొఫెసర్ నగేష్ విద్యార్థులకు సూచించారు. పరీక్షలు వాయిదా పడతాయంటూ జరుగుతున్న ప్రచారంలో  వాస్తవం లేదని...... నిర్ణీత షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు జరుగుతాయని స్పష్టం చేశారు.