
ఓయూ, వెలుగు: గ్రూప్-1 ఎగ్జామ్ను వాయిదా వేయాలని డిమాండ్చేస్తూ ఓయూ నుంచి బహుజన విద్యార్థి సంఘాలు మంగళవారం ‘చలో టీఎస్పీఎస్సీ’ నిర్వహించారు. ఆర్ట్స్ కాలేజీ నుంచి టీఎస్పీఎస్సీ ఆఫీస్కు ర్యాలీగా బయల్దేరిన స్టూడెంట్స్ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది.
పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా బహుజన విద్యార్థి జేఏసీ చైర్మన్ సంజయ్ మాట్లాడుతూ.. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్, మాస్ కాపీయింగ్కు బాధ్యులైన బోర్డు చైర్మన్, సెక్రటరీ, సభ్యులను తొలగించాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాతే ఎగ్జామ్ నిర్వహించాలన్నారు. 30 లక్షల మంది నిరుద్యోగులకు భరోసా ఇవ్వకుండా పరీక్ష నిర్వహిస్తే సర్కారు కు బుద్ధి చెబుతామన్నారు.