
టీఎస్పీఎస్సీ(TSPSC) పేపర్ లీకేజీపై ఓయూలో విద్యార్థుల ఆందోళన చేపట్టారు. సీఎం కేసీఆర్ (CM KCR) దిష్టిబొమ్మను దహనం చేశారు ఓయూ (OU) విద్యార్థులు. నిరుద్యోగ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడిన టీఎస్పీఎస్సీ చైర్మన్ ను అరెస్ట్ చేయాలని ఓయూ విద్యార్థులు డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీలో ప్రభుత్వం హస్తం ఉందంటూ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. TSPSC చైర్మన్ వెంటనే అరెస్టు చేసి విధుల నుంచి తప్పించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పై వ్యతిరేక నినాదాలు చేశారు విద్యార్థులు.
బోర్డ్ చైర్మన్ కి..సెక్రటరి తెలిసే పాస్ వర్డ్ లు బయటకు ఎలా లీక్ అయ్యాయని విద్యార్థలు ప్రశ్నించారు. అంగట్లో సరుకులు అమ్ముకున్నట్లు TSPSC పేపర్లు అమ్ముతున్నారని మండిపడ్డారు. ఒక్క AE పేపర్ కాదు అన్ని పేపర్లు లీక్ అయ్యి ఉంటాయని అనుమానం వ్యక్తం చేశారు. గ్రూప్ 1 కూడా లీక్ అయ్యి ఉంటుందన్నారు.