కోవిడ్ సేఫ్టీ ఎసెన్షియల్స్ డిమాండ్ 5 రెట్లు పెరిగింది

కోవిడ్ సేఫ్టీ ఎసెన్షియల్స్ డిమాండ్ 5 రెట్లు పెరిగింది
  • బీ2బీ ఈ-కామర్స్ వేదిక ఉడాన్ వెల్లడి
  • ఒక్క సెకండ్ వేవ్ లోనే 15 మిలియన్ల సేఫ్టీ ఎసెన్షియల్స్ అమ్మకాలు జరిగాయి –ఉడాన్

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి రెండు దశలలో విజృంభించడంతో దేశ వ్యాప్తంగా సేఫ్టీ ఎసెన్షియల్స్ డిమాండ్ ఐదు రెట్లు పెరిగింది. ఒక్క సెకండ్ వేవ్ సమయంలోనే 15 మిలియన్ల సేఫ్టీ ఎసెన్షియల్స్ అమ్మకాలు జరిగాయని బీ2బీ ఈ-కామర్స్ వేదిక ఉడాన్ వెల్లడించింది. అస్సామ్‌, పశ్చిమబెంగాల్‌, ఆంధ్రప్రదేశ్‌, బీహార్‌లకు 6 మిలియన్‌లకు పైగా వస్తువుల రవాణా జరుగగా 11 మిలియన్‌లకు పైగా రక్షిత మాస్కులు, ఒక లక్షకు పైగా ఫేస్‌ షీల్డ్ లు, ఆక్సిమీటర్లు, పీపీఈ సూట్లు మరియు కిట్స్‌, ఇన్‌ఫ్రారెడ్‌ ధర్మామీటర్లు, ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్ల తో పాటుగా ఇతర అత్యవసర వస్తువులను సెకండ్‌ వేవ్‌ ఆరంభం నుంచి అమ్మకాలు జరిగాయి.

కరోనా సెకండ్ వేవ్ సమయంలో తమ వేదిక ద్వారా జరిగిన కోవిడ్ సేఫ్టీ ఎసెన్షియల్స్ విక్రయాలకు సంబంధించిన వివరాలను భారతదేశంలో అతి పెద్ద బిజినెస్‌ టు బిజినెస్‌ (బీ2బీ) ఈ–కామర్స్‌ వేదిక ఉడాన్‌ మీడియాకు విడుదల చేసింది. దాదాపు 15 మిలియన్‌ల కోవిడ్‌ సేఫ్టీ ఎసెన్షియల్స్ ను  23వేలకు పైగా ఆర్డర్ల ద్వారా 400 మందికి పైగా విక్రేతలు 5వేలకు పైగా పిన్‌కోడ్స్‌ వ్యాప్తంగా ఈ వేదిక ద్వారా విక్రయించారు. ఈ వేదికపై రక్షిత మాస్కులు, ఫేస్‌ షీల్డ్స్‌, పీపీఈ సూట్లుకు ఐదు రెట్లకు పైగా డిమాండ్‌ పెరిగింది.

మార్చి ఆరంభం నుంచి నెమ్మదిగా సెకండ్‌ వేవ్‌ ఉధృతి తగ్గడం వరకూ  మొత్తం మ్మీద 6మిలియన్ల కోవిడ్‌ సేఫ్టీ ఎసెన్షియల్స్ ను అస్సాం, ఆంధ్రప్రదేశ్‌; పశ్చిమ బెంగాల్‌, బీహార్‌లకు రవాణా చేశారు. ఈ రాష్ట్రాలలోనే 50%కు పైగా ఆర్డర్లు ఉడాన్‌ ప్లాట్‌ఫామ్‌పై  కొవిడ్‌ ఎసెన్షియల్స్‌కు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్నాటక మరియు అస్సాం రాష్ట్రాల నుంచి అత్యధికంగా ఫేస్‌ షీల్డ్స్‌ ఆర్డర్లు ఈ వేదికపై వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా ఇన్‌ఫ్రారెడ్‌ ధర్మామీటర్లు విక్రయించగా, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌, బీహార్‌, ఉత్తరప్రదేశ్‌ లు కూడా ధర్మా మీటర్ల అమ్మకాలే ఎక్కువగా జరిగాయి. అలాగే పీపీఈ కిట్లకు డిమాండ్‌ పరంగా కూడా ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో ఉండగా, తరువాత స్థానాలలో  పశ్చిమ బెంగాల్‌, జార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, ఒడిషా ఉన్నాయి.

లైఫ్‌స్టైల్‌, ఎలక్ట్రానిక్స్‌ (నాన్‌–ఫుడ్‌ బిజినెస్‌)  హెడ్  ఉదయ్ భాస్కర్  ఉడాన్‌ మాట్లాడుతూ.. కోవిడ్‌–19 కాలంలో  విధించిన  నిబంధనల కారణంగా  రిటైలర్ల సరఫరా చైన్‌ మరియు పంపిణీ వ్యవస్థ పై ప్రభావం చూపిందన్నారు. ఈ సంక్షోభ సమయంలో తాము అవాంతరాలు లేని రీతిలో, సమయానికి తగినట్లుగా  కోవిడ్‌ సేఫ్టీ ఎసెన్షియల్స్‌ను అత్యుత్తమ ధరలలో కొనుగోలుదారులకు అందించామన్నారు. తద్వారా వినియోగదారులకు స్ధిరంగా మా రిటైల్‌ భాగస్వాములు  తమ సేవలను కొనసాగించారనే భరోసా అందించామని, అంతేకాకుండా ఆర్ధిక కార్యకలాపాలు కొనసాగేలా కూడా చేశాం’’ అని వివరించారు.