Anushka Poster: అనుష్క పోస్టర్తో.. హైదరాబాద్లో ఇన్ని యాక్సిడెంట్లు జరిగాయా..!

Anushka Poster: అనుష్క పోస్టర్తో.. హైదరాబాద్లో ఇన్ని యాక్సిడెంట్లు జరిగాయా..!

క్రిష్ దర్శకత్వంలో 2010లో తెరకెక్కిన మూవీ వేదం. ఇందులో అల్లు అర్జున్, అనుష్క శెట్టి, మంచు మనోజ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇందులో సరోజ అనే వేశ్య పాత్రలో అనుష్క నటనకు ప్రశంసలు దక్కాయి. సొంత వేశ్యా గృహం స్థాపించాలని కలలు కనే సరోజా నటనకు తెలుగు ఆడియన్స్ ఫిదా అయ్యారు.

ఈ సినిమాలో అనుష్క, కేవలం తన పోస్టర్‌తోనే స్పెషల్ ఫాలోయింగ్ క్రియేట్ అయ్యేలా చేసింది. ఇందులో భాగంగా అనుష్క వెనక్కి కొంటెగా చూస్తున్న ఒక ఫోటో సోషల్ మీడియాలో వీపరీతంగా ఆకట్టుకుంది. ఇక అలాంటి పోస్టర్ హైదరాబాద్ నడిబొడ్డు ఐన పంజాగుట్ట సర్కిల్‌లో.. హోర్డింగ్ చేసి మేకర్స్ పెట్టారు.

అందులో అనుష్క అందాన్ని చూస్తూ సుమారుగా 40 మైనర్ యాక్సిడెంట్స్ అయ్యాయట. డ్రైవర్లు దృష్టి మరల్చడంతో.. మరీ పెద్ద యాక్సిడెంట్స్ కాకపోయినా.. అనుష్క పోస్టర్‌ చూస్తూ ముందున్న వాహనాలను ఢీకొట్టేవారట. ఇలా రెగ్యులర్గా యాక్సిడెంట్స్ జరుగుతుండటం గమనించిన పోలీసులు GHMC అధికారులతో కలిసి అనుష్క హోర్డింగ్ని తొలగించారట. అలాంటి మత్తెక్కే అందంతో సినిమా ఫ్యాన్స్ ను మాత్రమే కాదు.. ప్రయాణికులను కూడా కళ్లు తిప్పుకోకుండా చేసింది అనుష్క.! 

ఇపుడు ఇదే విషయాన్నీ వేదం దర్శకుడు క్రిష్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. వేదం సినిమా విడుదలై 15 ఏళ్లు గడిచిన సందర్భంగా అప్పటి విషయాలను క్రిష్ పంచుకున్నారు.

ఈ సందర్భంగా హీరో అల్లు అర్జున్ కూడా స్పెషల్ ట్వీట్ చేశాడు. '15 సంవత్సరాల వేదం. నాకు ఊహించని సినిమా. ఇంత నిజాయితీగా సినిమా తెరకెక్కించినందుకు రూపొందించినందుకు డైరెక్టర్ క్రిష్ కు ధన్యవాదాలు. నా అద్భుతమైన సహనటులు అనుష్క, మంచు మనోజ్, మనోజ్ భాజ్ పాయ్ మరియు అనేక మంది ఇతరులకు.. ఈ ప్రయాణాన్ని మీ అందరితో పంచుకోవడం నిజంగా ప్రత్యేకమైనది.  ఇంతటి ధైర్యమైన దార్శనికతకు మద్దతు ఇచ్చినందుకు మొత్తం బృందానికి హృదయపూర్వక ధన్యవాదాలు' అని ట్వీట్ చేశాడు.