హైదరాబాద్ సిటీ, వెలుగు: నగరంలో నిర్వహించిన స్పెషల్డ్రైవ్లో సెల్ ఫోన్ మాట్లాడుతూ బండ్లు నడుపుతున్న 6,046 మందిపై కేసులు పెట్టామని ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ జోయల్ డేవిస్ తెలిపారు. ఏప్రిల్ 3 నుంచి 9 వరకు నిర్వహించిన తనిఖీల్లో ఒకవైపు బైక్లు నడుపుతూ.. మరో వైపు ఫోన్మాట్లాడుతూ 5,810 మంది దొరికారన్నారు. అలాగే ఆటోడ్రైవర్లు 51 మంది, కార్లు, ఇతర వెహికల్స్ నడుపుతూ 185 మంది పట్టుబడినట్టు చెప్పారు. ఈ తనిఖీలు ఇక నుంచి నిరంతరం కొనసాగిస్తామన్నారు.
