ఐపీఓకు ఓయో పేరెంట్ కంపెనీ..రూ.6వేల650 కోట్ల సేకరణకు సెబీ ఓకే

ఐపీఓకు ఓయో పేరెంట్ కంపెనీ..రూ.6వేల650 కోట్ల సేకరణకు సెబీ ఓకే

ముంబై: గ్లోబల్ ట్రావెల్ టెక్ యూనికార్న్ ఓయో పేరెంట్​ కంపెనీ ప్రిజమ్​ఐపీఓ ద్వారా రూ.6,650 కోట్లు సేకరించేందుకు సెబీ అనుమతి పొందింది. ఈ ప్రతిపాదిత పబ్లిక్ ఆఫరింగ్ ద్వారా కంపెనీ విలువ రూ.58 వేల కోట్ల నుంచి రూ.67 వేల కోట్లు ఉంటుందని అంచనా. ప్రిజమ్​గత డిసెంబరులో కాన్ఫిడెన్షియల్​ ఫైలింగ్​ విధానంలో ఐపీఓ డాక్యుమెంట్లను సెబీకి అందజేసింది. అదేనెల 20న జరిగిన అసాధారణ సాధారణ సమావేశం (ఈజీఎం) లో వాటాదారుల ఆమోదం లభించింది. కొత్త ఈక్విటీ షేర్ల జారీ ద్వారా రూ.6,650 కోట్ల వరకు సేకరించేందుకు కంపెనీకి గ్రీన్​సిగ్నల్​ వచ్చింది.