దంతాలపల్లి, వెలుగు: రైతులకు మద్దతు ధర కల్పించేందుకే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రునాయక్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని కుమ్మరికుంట్ల గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో తహసీల్దార్ సునీల్ తదితరులు పాల్గొన్నారు.

