జనగామ, వెలుగు: స్టేషన్ ఘన్పూర్లో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిన మెగా లెదర్ పార్క్కు ఆమోదం తెలిపాలని వరంగల్ ఎంపీ కడియం కావ్య కోరారు. రూల్ 377 కింద లోక్సభలో ఆమె మాట్లాడారు. స్టేషన్ ఘన్పూర్లో ప్రభుత్వ గుర్తించిన 120 ఎకరాల్లో తెలంగాణ స్టేట్ లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మెగా లెదర్ పార్క్ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పంపించిన ప్రతిపాదన పెండింగ్లో ఉందని గుర్తు చేశారు.
లెదర్ పరిశ్రమకు అవసరమైన ముడి పదార్థాల లభ్యతతో పాటు ఎఫ్డీడీఐ, నిఫ్ట్, గిల్ట్ వంటి సంస్థలు సహకరించడానికి అంగీకరించాయని చెప్పారు. ఈ పార్క్కు కేంద్రం ఆమోదిస్తే ఎస్సీ వర్గాలకు చెందిన యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఎంపీ తెలిపారు.
