అన్నం తినేవారు ఎవరూ కూడా పార్టీ మారరని హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు . మార్చి 30వ తేదీ శనివారం రోజు తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. కడియం శ్రీహరి పార్టీ మారడం నమ్మించి గొంతు కోయడమేనని అన్నారు. కడియం పార్టీకి ద్రోహం చేశారని, ఆయనకు పార్టీ ఏం తక్కువ చేసిందని కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు.
పార్టీలు మారే వారిని ప్రజలు చీ కోడుతున్నారని.. పార్లమెంట్ ఎన్నికల తరువాత వారికి అసలు నిజాలు తెలుస్తాయన్నారు కౌశిక్ రెడ్డి. కేసీఆర్ సీఎంగా ఉన్నపుడు రైతులకు ఎప్పుడు అన్యాయం చెయ్యలేదని.. ఇపుడు రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రైతులకు అండగా ఉండేందుకు కేసీఆర్ క్షేత్ర స్థాయి లోకి వెళ్లి రైతులకు అండగా ఉంటారని చెప్పారు కౌశిక్ రెడ్డి.
Also Read:నేను పార్టీ మారితే బీఆర్ఎస్ కు భయమెందుకు?
మరోవైపు తాను పార్టీ మారితే బీఆర్ఎస్ కు భయమెందుకని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రశ్నించారు. ఇవాళ హైదరాబాద్ లోని తన నివాసంలో నియోజకవర్గానికి చెందిన ముఖ్యనాయకులు, కార్యకర్తలు, అనుచరులతో ఆయన సమావేశమై.. పార్టీ మార్పుపై వారి అభిప్రాయాలను సేకరించారు. పసునూరి దయాకర్, ఆరూరి రమేశ్ పార్టీ మారితే లేని అభ్యంతరం తన విషయంలోనే ఎందుకన్నారు. తన రాజకీయ జీవితంలో తనపై ఒక్క అవినీతి మరక లేదని, ఒక్క పిట్టీ కేసు కూడా నమోదు కాలేదని కడియం చెప్పారు.