గోతులు తవ్వే ఈటల నీతులు చెబుతున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. తనకు, తన కుటుంబానికి రక్తం కారినా కేసిఆర్ దే భాధ్యతని ఈటల అంటున్నారని.. కేసిఆర్ ది రక్త చరిత్ర కాదన్నారు. ఈటలదే హత్యలు చేయించిన చరిత్ర అని ఆరోపించారు. నర్సింగపూర్ గ్రామంలో బాలరాజు అనే వ్యక్తిని చంపించింది ఎవరని కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. వీణవంకలో గెల్లు మల్లయ్యపై హత్యాయత్నం, కరాటే సమ్మయ్యను పోలీసులతో చిత్రహింసలు పెట్టించింది నువ్వు కాదా అని ఈటలను ప్రశ్నించారు. ఈటల రాజేందర్ కనిపించేంతా అమాయకుడు కాదని కౌశిక్ రెడ్డి అన్నారు. తాను చెప్పేది తప్పు అయితే ముక్కు నేలకు రాసి క్షమాపణ చెబుతానని ఆయన స్పష్టం చేశారు.
కేసీఆర్ కు, ఈటలకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని అన్నారు. హుజూరాబాద్ ప్రజలు ఓట్లు వేస్తే..గజ్వేల్ లో పోటీ చేస్తానని చెప్పి వారిని ఈటల మోసం చేశాడాని, టీఆర్ఎస్ లో తిరిగితే చంపేస్తామని తన మనుషులతో ఈటల బెదిరిస్తున్నారంటూ కౌశిక్ రెడ్డి ఆరోపించారు. తనని కూడా బెదిరించారని, మీరు బెదిరిస్తే తాము భయపడే రకం కాదని కౌశిక్ రెడ్డి వెల్లడించారు.