బోయిగూడ ప్రమాదంపై మోడీ సంతాపం

బోయిగూడ ప్రమాదంపై మోడీ సంతాపం

న్యూఢిల్లీ: సికింద్రాబాద్ బోయిగూడ టింబర్ డిపోలో జరిగిన అగ్ని ప్రమాద మృతుల పట్ల ప్రధాని మోడీ సంతాపం వ్యక్తం చేశారు. ఈ అగ్ని ప్రమాదంలో బీహార్ కు చెందిన 11మంది కూలీలు మృతి చెందారు.  మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ 2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియాను మోడీ ప్రకటించారు. ప్రమాదంలో మృతి చెందిన బీహార్ వలస కార్మికుల మృతదేహాలను వారి స్వస్థలాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు.