![సీఎం రేవంత్ రెడ్డితో చిత్రకారుడు రుద్ర రాజేశం భేటీ](https://static.v6velugu.com/uploads/2024/05/painter-rudra-rajesham-met-cm-revanth-reddy_royGeamnFp.jpg)
హైదరాబాద్: వచ్చే నెల 2న తెలంగాణ ఆవిర్భావ దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా ఆవిష్కరించనున్న అధికారిక చిహ్నం సిద్ధమవుతోంది. ఇవాళ జూబ్లీ హిల్స్ లోని సీఎం నివాసంలో చిత్రకారుడు రుద్ర రాజేశం సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా పలు నమూనాలను చూపించారు. వాటిని పరిశీలించిన ముఖ్యమంత్రి కొన్ని సూచనలు చేశారు. రెండు మూడు రోజుల్లో అధికారిక చిహ్నానికి తుదిరూపు వచ్చే అవకాశం ఉంది.