భద్రాద్రికొత్తగూడెం, వెలుగు:పైసలుండి.. పైరవీ చేయగలిగితే చాలు ఐసీడీఎస్లో కోరుకున్న చోటికి డిప్యుటేషన్పై పంపిస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లాలన్నా పైరవీ చేసుకుంటే చాలనే విధంగా ఐసీడీఎస్లో ప్రచారం సాగుతోంది. ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్సర్వీసెస్(ఐసీడీఎస్)లో డీడబ్ల్యూఓ, సీడీపీఓ, ఏసీడీపీఓకు ప్రమోషన్లు ఇవ్వకపోవడం, ఆయా పోస్టులు రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉండడంతో హైదరాబాద్లోని హెడ్డాఫీస్లో పైరవీలు చేస్తున్నారు. నచ్చిన చోటికి డిప్యుటేషన్పై వెళ్లడం ఈ శాఖలో కామన్గా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలకు 33 డీడబ్ల్యూఓ ఆఫీస్లు, దాదాపు 45 పైగా ఐసీడీఎస్ప్రాజెక్టులున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 11 ఐసీడీఎస్ ప్రాజెక్టులున్నాయి. డీడబ్ల్యూఓలతో పాటు సీడీపీఓల పోస్టులు రాష్ట్రంలోని పలు ప్రాజెక్ట్లలో ఖాళీగా ఉన్నాయి. దీంతో డీడబ్ల్యూఓ, సీడీపీఓ, ఏసీడీపీఓలు వారికి అనుకూలంగా ఉన్నచోటికి డిప్యుటేషన్లు వేయించుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 మంది డీడబ్ల్యూఓలలో దాదాపు 10 మంది వరకు, 25 మందికి పైగా సీడీపీఓలు డిప్యుటేషన్పై డ్యూటీ చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 11 ఐసీడీఎస్ ప్రాజెక్ట్లలో నలుగురు సీడీపీఓలు డిప్యుటేషన్పై పని చేస్తున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఇద్దరు సీడీపీఓలు భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం ఐసీడీఎస్ ప్రాజెక్ట్లో, రంగారెడ్డి జిల్లాకు చెందిన సీడీపీఓ కొత్తగూడెం అర్బన్ఐసీడీఎస్ప్రాజెక్టులో డ్యూటీ చేస్తున్నారు. బూర్గంపాడు ఏసీడీపీఓ దమ్మపేట సీడీపీఓగా డిప్యుటేషన్పై చేస్తున్నారు. వాంకిడి ఏసీడీపీఓ అశ్వారావుపేట ప్రాజెక్ట్లో డిప్యుటేషన్పై ఉన్నారు. జిల్లా ఐసీడీఎస్ఆఫీస్లో సూపరింటెండెంట్గా జాయిన్అయిన ఆఫీసర్ కొద్ది రోజుల్లోనే తనకున్న పలుకుబడితో ఆసిఫాబాద్కు డిప్యుటేషన్పై వెళ్లారు. దీంతో సూపరింటెండెంట్ పోస్టు కొంతకాలంగా ఖాళీగా ఉంది.
పోస్టుల ఖాళీలు చూపట్లే
సీడీపీఓ పోస్టులు ఖాళీగా ఉంటే జిల్లాలోని ఏసీడీపీఓలకు ఇవ్వాల్సి ఉంది. కానీ ఇతర జిల్లాల వారు డిప్యుటేషన్పై పని చేస్తుండడంతో ఆ పోస్టుల ఖాళీలను చూపడం లేదని పలువురు సీడీపీఓలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జోనల్ విధానంలో స్థానికులకే ఉద్యోగాలు లభిస్తాయని సీఎం కేసీఆర్ చెప్పిన మాటలు అమలులోకి వచ్చేసరికి నీటి మీద రాతల్లాగే మారాయని విమర్శిస్తున్నారు. డిప్యుటేషన్లతో తమకు అన్యాయం జరుగుతోందని సీడీపీఓలు, ఏసీడీపీఓలు వాపోతున్నారు. అక్రమ డిప్యుటేషన్లను రద్దు చేసే విధంగా రాష్ట్ర ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.