పాకిస్తాన్ లో 22 మంది టెర్రరిస్టుల కాల్చివేత

పాకిస్తాన్ లో  22 మంది టెర్రరిస్టుల కాల్చివేత

పెషావర్: నిషేధిత తెహ్రీక్- ఇ -తాలిబాన్ పాకిస్తాన్ (టీటీపీ)కు చెందిన 22 మంది టెర్రరిస్టులను పాకిస్తాన్ ఆర్మీ హతమార్చింది. మంగళవారం ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌‌‌‌‌‌‌‌లో జరిపిన ఇంటెలిజెన్స్ ఆధారిత ఆపరేషన్‌‌‌‌‌‌‌‌లో ఉగ్రవాదులను ఎన్​కౌంటర్​ చేసినట్టు పాక్​ఆర్మీ ప్రకటించింది. 

మవారం నార్త్ వజీరిస్తాన్ సరిహద్దులోని బన్ను జిల్లాలో టెర్రరిస్టులు ఉన్నారనే పక్కా సమాచారం ఆధారంగా భద్రతా బలగాలు ఈ ఆపరేషన్ నిర్వహించాయని ఆర్మీ ఓ ప్రకటనలో తెలిపింది. 

భద్రతా బలగాలు టెర్రరిస్టుల స్థావరాన్ని చుట్టుముట్టగానే కాల్పులు ప్రారంభించారని.. తీవ్రమైన ఎదురు కాల్పుల తర్వాత 22 మంది ఉగ్రవాదులు హతమయ్యారని పేర్కొంది. 

ఆ ప్రాంతంలో ఇంకా కూంబింగ్​జరుగుతోందని తెలిపింది. పాకిస్తాన్​లో ఉగ్రవాద ముప్పును పూర్తిగా తుడిచిపెట్టేందుకు భద్రతా బలగాలు వేగంగా ముందుకు కదులుతున్నాయని ఐఎస్​పీఆర్​వెల్లడించింది.