హైదరాబాద్: పాక్ పై ప్రతీకారం తీర్చుకున్న భారత ఆర్మీకి సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. దెబ్బకు దెబ్బ కొంటామంటున్నారు. పుల్వామా అటాక్ లో చనిపోయిన అమర జవాన్ల ఆత్మకు ఇప్పుడే నిజమైన శాంతి కలిగిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. భారత వైమానిక దళానికి చెందిన మిరేజ్ యుద్ధ విమానాలు ఇవాళ తెల్లవారుజామున LOC వెంట ఉన్న ఉగ్ర స్థావరాలను తుత్తునీయులు చేశాయి. ఈ దాడి పట్ల వివిధ పార్టీలకు చెందిన నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారత వైమానిక దళ పైలట్లకు నా సెల్యూట్ అంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.
పుల్వామా దాడితో భారత్ చలించిపోయింది. ఆ దాడిని అన్ని పార్టీలు ఖండించాయి. ప్రభుత్వం, సైన్యం ఎటువంటి చర్య తీసుకున్నా.. దాన్ని సమర్థిస్తామని కూడా విపక్షాలు చెప్పాయి. అయితే ఇవాళ మిరేజ్ విమానాలతో దాడి జరిగిన ఘటనపై ఒక్కొక్క రాజకీయ పార్టీ తన వైఖరిని సోషల్ మీడియా ద్వారా తెలుపుతున్నాయి.
?? I salute the pilots of the IAF. ??
— Rahul Gandhi (@RahulGandhi) February 26, 2019
Wow, if this is true this was not a small strike by any stretch of imagination but will wait for official word, should any be forthcoming. https://t.co/bOFt7SXl43
— Omar Abdullah (@OmarAbdullah) February 26, 2019