లాహోర్‌‌‌‌‌‌‌‌లో పోలీసుల కాల్పులు.. 11 మంది మృతి

లాహోర్‌‌‌‌‌‌‌‌లో పోలీసుల కాల్పులు.. 11 మంది మృతి
  • టీఎల్‌‌‌‌పీ ర్యాలీ హింసాత్మకం 

లాహోర్: పాలస్తీనాకు మద్దతుగా పాకిస్తాన్‌‌‌‌లో ఇస్లామిక్ సంస్థ టెహ్రీక్‌‌‌‌–ఇ–లబైక్ పాకిస్తాన్ (టీఎల్‌‌‌‌పీ) చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. గాజాలో మరణాలను, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ శాంతి ప్రణాళికను నిరసిస్తూ టీఎల్‌‌‌‌పీ ఆధ్వర్యంలో గురువారం నుంచి నిరసనలు మొదలయ్యాయి. ఇస్లామాబాద్, రావల్పిండి, లాహోర్‌‌‌‌‌‌‌‌లో నిరసనకారులు ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలో టీఎల్‌‌‌‌పీ చీఫ్ సాద్ రిజ్వీ ఆధ్వర్యంలో లాహోర్ నుంచి ఇస్లామాబాద్‌‌‌‌కు మార్చ్ చేపట్టారు. 

అక్కడ యూఎస్ ఎంబసీ ముందు నిరసన తెలపాలని ర్యాలీ మొదలుపెట్టారు. అయితే ఈ మార్చ్‌‌‌‌ను పోలీసులు శనివారం అడ్డుకున్నారు. లాహోర్‌‌‌‌‌‌‌‌లోని అజాదీ చౌక్‌‌‌‌లో పోలీసులు, నిరసనకారుల మధ్య తోపులాట జరిగింది. ఆగ్రహానికి గురైన టీఎల్‌‌‌‌పీ కార్యకర్తలు పోలీస్ వాహనాలకు నిప్పు పెట్టారు. 

దీంతో కొంతమంది పోలీసులు గాయపడ్డారు. ఈ క్రమంలో పోలీసులు కాల్పులు జరపగా 11 మంది టీఎల్‌‌‌‌పీ కార్యకర్తలు చనిపోయారు. 50 మందికి పైగా గాయపడ్డారు. కాగా, ఇస్లామాబాద్, రావల్పిండిలోనూ నిరసనలు మిన్నంటాయి.