అంజూ ఇప్పుడు ఫాతిమా.. పాక్‌లో ముస్లింగా మారి పెళ్లి చేసుకుంది

అంజూ ఇప్పుడు ఫాతిమా.. పాక్‌లో ముస్లింగా మారి పెళ్లి చేసుకుంది

ఫేస్‌బుక్ స్నేహితుడి(నస్రుల్లా)ని కలవడానికి పాకిస్తాన్‌ వెళ్లిన భారత మహిళ అంజు(34) వ్యవహారం కీలక మలుపు తిరిగింది. అంజు ఇస్లాం మతాన్నిఆచరించి ఫేస్‌బుక్ స్నేహితుడిని నిఖా చేసుకున్నట్లు కథనాలు వస్తున్నాయి. అంజు తన పేరును ఫాతిమాగా మార్చుకుందని సమాచారం. ఆమె బురఖా ధరించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.   

నిన్నటికి నిన్న అంజూ వచ్చేస్తుందని.. కేవలం ఫ్రెండ్ ను కలవటానికి మాత్రమే పాకిస్తాన్ వెళ్లిందంటూ వార్తలోచ్చాయి. 24 గంటలు గడవకముందే మొత్తం సీన్ మారిపోయింది. ఫేస్ బుక్ లో పరిచయం అయిన నుజురుల్లాను కలవటానికి పాకిస్తాన్ వెళ్లిన అంజూ ఏకంగా ఇస్లాం మతం ఆచరించి.. అతన్ని పెళ్లి చేసుకుంది. అంజూ పేరును ఫాతిమాకు మార్చుకుంది. ఇదంతా ఇప్పుడు భారత ప్రజలను గురి చేస్తోంది. నాలుగు రోజులుగా అంజూ చెబుతున్నది అంతా అబద్దమేనా..? ఆమె ముందుగానే ప్లాన్ చేసుకున్నదా! లేక అక్కడి వారు బలవంతం చేశారా? అన్నది ఆసక్తిగా మారింది.

ప్రస్తుతం అంజూ వీసా గడువు ఆగస్ట్ 20వ తేదీ వరకు మాత్రమే ఉంది. ఆ తర్వాత ఇండియా వచ్చేయాలి. అంజూ ఇప్పుడు ఇస్తాం మతం స్వీకరించటంతోపాటు.. నుజురుల్లాను పెళ్లి చేసుకోవటం.. పేరు మార్చుకోవటం చూస్తుంటే.. పాకిస్తాన్ దేశం ఆమెకు పాక్ పౌరసత్వం ఇస్తుందా ఏంటీ అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇది కచ్చితంగా లవ్ జీహాదీ అంటున్నారు ఇండియన్ నెటిజన్లు.