గుజరాత్ లో రూ.350 కోట్ల విలువైన హెరాయిన్ స్వాధీనం

 గుజరాత్ లో రూ.350 కోట్ల విలువైన హెరాయిన్ స్వాధీనం

గుజరాత్ లోని అరేబియా సముద్ర తీర ప్రాంతంలోని జాఖవ్ పోర్టులో భారీ మొత్తంలో హెరాయిన్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తీర ప్రాంత గస్తీ దళాలు, గుజరాత్ యాంటీ టెర్రరిజం స్వ్యాడ్ సంయుక్తంగా చేపట్టిన తనిఖీల్లో రూ.350 కోట్ల విలువ గల 50 కిలోల హెరాయిన్ పట్టుబడినట్టు అధికారులు తెలిపారు. పాకిస్తాన్ నుంచి వచ్చిన ఓ బోటులో హెరాయిన్ ను తీసుకెళ్తుండగా విషయం బయట పడినట్టు చెప్పుకొచ్చారు. పెద్ద మొత్తంలో హెరాయిన్ తో పాటు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్టు స్పష్టం చేశారు.

ఈ విషయాన్ని ఇండియన్ కోస్ట్ గార్డ్ ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. అంతేకాకుండా హెరాయిన్ ను తరలించిన బోటును ఏ1 సకర్ బోటుగా గుర్తించినట్టు వెల్లడించింది. ఇదిలా ఉండగా ఈ ఘటనలో మరిన్ని వివరాలు రాబట్టేందుకు అధికారులు విచారణ చేస్తున్నారు.