
భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు ముదురుతున్నాయి.. రెండు రోజుల కిందట ఇరు దేశాలు పరస్పర దాడులు ప్రారంభించిన క్రమంలో పాక్ సంచలన ప్రకటన చేసింది. భారత్ పై పూర్తిస్థాయి మిలిటరీ ఆపరేషన్ చేపట్టినట్టు ప్రకటించింది పాక్. ఆపరేషన్ బన్యన్ ఉల్ మర్సూస్ ను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది పాక్. శనివారం ( మే 10 ) నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఈ మేరకు సంచలన ప్రకటన చేశారు ఆ దేశ డైరెక్టర్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరీ.
ఈ క్రమంలో పాక్ దాడులను మరింత తీవ్రతరం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక పాకిస్తాన్లోని మూడు ఎయిర్బేస్లపై భారత్ దాడి చేసినట్లు తెలుస్తోంది. రావల్పిండిలోని నూర్ఖాన్ ఎయిర్బేస్తో పాటు మురిద్, షార్కోట్ వైమానిక స్థావరాలపై భారత్ దాడి చేసినట్లు సమాచారం. ఇప్పటికే భారత ఆర్మీ దాటికి విలవిలలాడుతున్న పాక్.. ప్రపంచవ్యాప్తంగా ఏకాకిగా మారింది. ఈ పరిస్థితిలో ప్రత్యక్ష యుద్దానికి సిద్దమైన పాక్.. భారత్ దాడిని ఏమేరకు ఎదుర్కొంటుందో చూడాలి.
ఇదిలా ఉండగా.. హర్యానా, పంజాబ్ రాష్ట్రాలపై పాక్ మిస్సైల్ దాడులకు పాల్పడగా.. భారత వైమానిక దళాలు వాటిని అడ్డుకొని ధ్వంసం చేశాయి. ఈ క్రమంలో శనివారం ( మే 10 ) ఉదయం 10 గంటలకు కీలక ప్రెస్ మీట్ నిర్వహించనున్నట్లు తెలిపింది ప్రభుత్వం. శనివారం రావల్పిండి, షార్కోట్ లోని వైమానిక స్థావరాలతో సహా పాకిస్తాన్ లోని పలు నగరాల్లో పేలుళ్లు జరిగినట్లు తెలుస్తోంది. ఈ దాడి కారణంగా ఎయిర్ స్పేస్ ను ముసేసినట్లు ప్రకటించింది పాక్.