నోయిడా: పాకిస్తాన్కు చెందిన సీమాహైదర్ ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్షా, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్లకు రాఖీలు పంపింది. ఈ సందర్భంగా సీమా హైదర్ మాట్లాడుతూ...ఈ నెల 30న రక్షాబంధన్ పురస్కరించుకుని రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్లకు రాఖీలు పంపినట్లు తెలిపింది.
ఈ దేశ బాధ్యతలు తమ భుజాలపై మోస్తున్న ప్రియమైన సోదరులకు రాఖీలు ముందుగానే పంపుతున్నాను అని పేర్కొంది. రాఖీలు పంపుతున్నందుకు సంతోషంగా ఉందని, జై శ్రీరామ్, జైహింద్, హిందూస్తాన్ జిందాబాద్అంటూ నినాదాలు చేసింది. ఈమేరకు మంగళవారం సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేసింది.
పాకిస్తాన్ సింధ్ ప్రావిన్స్కు చెందిన సీమా హైదర్ తన నలుగురు పిల్లలతో కలిసి ఈ ఏడాది మేలో భారత్ వచ్చింది.