మోదీ, అమిత్​ షాలకు సీమా హైదర్ రాఖీలు ​

మోదీ, అమిత్​ షాలకు సీమా హైదర్ రాఖీలు ​

నోయిడా: పాకిస్తాన్​కు చెందిన సీమాహైదర్​ ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్​షా, ఆర్ఎస్ఎస్ చీఫ్​ మోహన్​ భగవత్​లకు రాఖీలు పంపింది. ఈ సందర్భంగా సీమా హైదర్​ మాట్లాడుతూ...ఈ నెల 30న రక్షాబంధన్ ​పురస్కరించుకుని రక్షణశాఖ మంత్రి రాజ్​నాథ్​సింగ్, యూపీ​ సీఎం యోగి ఆదిత్యనాథ్​లకు రాఖీలు పంపినట్లు తెలిపింది. 

ఈ దేశ బాధ్యతలు తమ భుజాలపై మోస్తున్న ప్రియమైన సోదరులకు రాఖీలు ముందుగానే పంపుతున్నాను అని పేర్కొంది. రాఖీలు పంపుతున్నందుకు సంతోషంగా ఉందని, జై శ్రీరామ్, జైహింద్, హిందూస్తాన్​ జిందాబాద్​అంటూ నినాదాలు చేసింది. ఈమేరకు మంగళవారం సోషల్​ మీడియాలో వీడియో పోస్టు చేసింది.

 పాకిస్తాన్​ సింధ్ ​ప్రావిన్స్​కు చెందిన సీమా హైదర్​ తన నలుగురు పిల్లలతో కలిసి ఈ ఏడాది మేలో భారత్​ వచ్చింది.