ఘనంగా పామెన భీం భరత్ బర్త్ డే

ఘనంగా పామెన భీం భరత్ బర్త్ డే

చేవెళ్ల, వెలుగు :  చేవెళ్ల సెగ్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి పామెన భీం భరత్ బర్త్ డే వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. చేవెళ్ల సెగ్మెంట్​లోని షాబాద్, శంకర్​పల్లి, చేవెళ్ల, మొయినాబాద్, నవాబ్ పేట మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఆయన ఇంటికి భారీగా తరలివచ్చి విషెస్ తెలిపారు. చేవెళ్ల గ్రామ సర్పంచ్ బండారి శైలజ, పీఏసీఎస్ చైర్మన్లు దేవర వెంకటరెడ్డి, ప్రతాప్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ టేకులపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. 

కాంగ్రెస్​లో చేరిన బీఆర్ఎస్ నేతలు

చేవెళ్ల మండల పరిధిలోని ఖానాపూర్​కు చెందిన బీఆర్ఎస్ నేతలు గురువారం పామెన భీం భరత్  సమక్షంలో కాంగ్రెస్​లో చేరారు. సుమారు 90 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా పామెన భీం భరత్ మాట్లాడుతూ..  తెలంగాణ అభివృద్ధి రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్​తోనే సాధ్యమవుతుందన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలపై నమ్మకంతో పార్టీలో చేరుతున్నారన్నారు.