పెద్దమ్మతల్లికి ఘనంగా పంచామృతాభిషేకం

పెద్దమ్మతల్లికి  ఘనంగా పంచామృతాభిషేకం

పాల్వంచ రూరల్, వెలుగు : పాల్వంచ మండల పరిధిలోని కేపీ జగన్నాథపురంలోని పెద్దమ్మతల్లికి శుక్రవారం వైభవంగా పంచామృతాభిషేకం చేశారు. ముందుగా అమ్మవారికి పసుపు, కుంకుమ గాజులు, హారతి సమర్పించారు.

అనంతరం ఆలయంలోని అమ్మవారి మూలవిరాట్​కు పంచామృతాభిషేకం నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ రజినికుమారి, చైర్మన్​ మహిపతి రామలింగం, ధర్మకర్తలు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.