ఫీల్డ్​ అసిస్టెంట్​ను తొలగించాలని డిమాండ్​ : పంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు

ఫీల్డ్​ అసిస్టెంట్​ను తొలగించాలని డిమాండ్​ :  పంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు

లింగంపేట, వెలుగు: శెట్​పల్లి గ్రామ ఫీల్డ్​అసిస్టెంట్​శివరాంను విధుల నుంచి తొలగించాలని పంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు డిమాండ్​ చేశారు. బుధవారం స్థానిక ఎంపీడీవో ఆఫీస్​లో జిల్లా డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ సాయన్న, ఎంపీడీవో మల్లికార్జున్​రెడ్డిలకు ఫిర్యాదు చేశారు. 

ఉఫాది హామీపథకంలో చెరువులో పూడికమట్టి తరలించడానికి రైతుల నుంచి రూ.4,000 లంచం అడిగాడని ఆరోపించారు. గ్రామసభలో సైతం ఫీల్డ్ ​అసిస్టెంట్​ ను తొలగించాలని ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు సర్పంచ్​ పద్మరెడ్డి తెలిపారు. జీపీ తీర్మానించిన ప్రకారం విచారణ చేపట్టి, విధుల నుంచి తొలగించాలని కోరారు.