ఖానాపూర్లో అలుగు కలకలం

ఖానాపూర్లో అలుగు కలకలం

ఖానాపూర్, వెలుగు: ఖానాపూర్​లోని బర్కత్​పురా కాలనీలో శనివారం అలుగు కలకలం రేపింది. కాలనీలోని ఓ మురికి కాలువలో అలుగు కనిపించడంతో స్థానికులు ఫారెస్ట్ సిబ్బందికి మాచారమిచ్చారు. వారు వచ్చి దాన్ని స్వాధీనం చేసుకున్నారు. 

రెండ్రోజుల క్రితం కొందరు వేటగాళ్లు అలుగును బంధించి తెచ్చారని సమాచారంతో పలువురిని ఫారెస్ట్ అధికారులు అదుపులో తీసుకొని విచారణ జరుపుతున్నారు. ఈ సమయంలో అలుగు పట్టణంలో ప్రత్యక్షం కావడం హాట్ టాపిక్ గా మారింది.