కొత్తపల్లి, వెలుగు : పదోతరగతి ఫలితాల్లో పారమిత విద్యార్థుల ప్రతిభ చాటినట్లు స్కూల్చైర్మన్ ఇనుగంటి ప్రసాదరావు తెలిపారు. రాచమల్ల ఆద్య 583, రామక కార్తికేయ 583, గట్టు సంప్రీతి 582 మార్కులు సాధించగా.. 84 మంది విద్యార్థులు 90% పైగా, 173 మంది విద్యార్థులు 80% పైగా, 198 మంది విద్యార్థులు 70% పైగా, 99 శాతం విద్యార్థులు 60% పైగా సాధించినట్లు పేర్కొన్నారు.
మ్యాథ్స్, సోషల్, తెలుగులో 100 మార్కులు, ఇంగ్లిష్, సైన్స్లో 99, హిందీలో 98 మార్కులు సాధించినట్లు వివరించారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను చైర్మన్ ప్రసాదరావు అభినందించారు. కార్యక్రమంలో డైరెక్టర్లు ప్రసూన, అనుకర్ రావు, రస్మిత, వినోదరావు, రాకేశ్, వీయూఎం ప్రసాద్, హన్మంతరావు, హెచ్ఎంలు ప్రశాంత్, బాలాజీ, కవిత సమన్వయకర్త శ్రీనాథ్, టీచర్స్ పాల్గొన్నారు.

