కరోనాతో కొడుకు.. తట్టుకోలేక పేరెంట్స్ మృతి

కరోనాతో కొడుకు.. తట్టుకోలేక పేరెంట్స్ మృతి

జవహర్ నగర్: కొడుకు మరణాన్ని తట్టుకోలేక తల్లిదండ్రులు గుండెపోటుతో మృతి చెందిన ఘటన మేడ్చల్ జిల్లా, జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వంపుగుడలో చోటు చేసుకుంది. వివరాలు.. కరోనాతో బాధపడుతూ పిసరి హరీశ్ రెడ్డి (31) గత 20 రోజులుగా చికిత్స   పొందుతూ ఆదివారం తుది శ్వాస విడిచాడు. అయితే కొడుకు చనిపోయిన బాధను తట్టుకోలేక పోయిన హరీశ్ పేరెంట్స్.. 24 గంటలు గడవకముందే కన్నుమూశారు. హరీశ్ అమ్మానాన్నలు ఐదు నిమిషాల వ్యవధిలో గుండెపోటుతో చనిపోవడాన్ని చుట్టుపక్కల వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మృతి చెందడంతో వారి బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.