మాకూ దళిత బంధు ఇవ్వండి.. మిన్నంటిన ఆందోళనలు

మాకూ దళిత బంధు ఇవ్వండి.. మిన్నంటిన ఆందోళనలు

వికారాబాద్ జిల్లా పరిగి వ్యాప్తంగా దళిత బంధు కోసం నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అర్హులైన వారికి కాకుండా కేవలం బీఆర్ఎస్ నాయకులకు తమ అనుచరులకే వర్తించేలా.. ఎమ్మెల్యే మహేష్ రెడ్డి వ్యవహరిస్తున్నారంటు ఆందోళనలు మిన్నంటుతున్నాయి. అర్హులైన వారికి దళిత బంధు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. కదావన్ పూర్, నర్సయ్యగూడ గ్రామాల దళితులు రోడెక్కారు. పరిగి షాద్ నగర్ ప్రధాన రహదారిపై బైటాయించి రాస్తారోకో నిర్వహించారు. 

కేసీఆర్, ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ.. దిష్టిబొమ్మలు దహనం చేశారు. ఆందోళన కారుల నిరసనతో భారీగా వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిరసన కారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు దళితులకు మధ్య తోపులాట జరిగింది.